తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జీహెచ్ఎంసీ ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులను చర్చించి, కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కరోనా రోగలక్షణం వున్న వ్యక్తులందరికీ వారికి హోం ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.
టెలికాన్పరెన్స్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇవే:
- మున్సిపల్ స్టాఫ్, ఎఎన్ఎమ్ మరియు కనీసం ఇద్దరు ఆశా వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి
- జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయి. కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తాయి. కరోనా రోగులను అనుసరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు బస్తీ దవాఖానాలలో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టడం.
- దవాఖానాలో పరిశుభ్రమైన పరిస్థితులను నిర్వహించడానికి దవాఖానా ప్రాంగణాన్ని చీకటిప్రదేశాలు లేకుండా కాంతివంతంగా వుంచడానికి వైట్ వాషింగ్ మొదలైన చర్యలు చేపట్టాలి.
- అన్ని సర్కిల్లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలి
ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్య విద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ