ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో రోజా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీవీ షోలు, సినిమా షూటింగ్లకు స్వస్తి చెప్తున్నట్లు రోజా ప్రకటించారు. సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మ వారిని రోజా దర్శించుకున్నారు. ఈ క్రమంలో రోజాకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే రోజాకు లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని ఈవో భ్రమరాంబ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు. నా ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్ తోనే ఉంటాను, ఆయన కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయటం నా మొదటి ప్రాధాన్యం. అందుకే ఇకపై షూటింగ్లు మానేస్తున్నాను. ఇకపై జబర్దస్త్ షోలో కూడా పాల్గొనను చేయను అని రోజా స్పష్టం చేశారు. కాగా, నూతనంగా ఏర్పాటు చేసిన కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. 11 మంది పాత మంత్రులను కొనసాగించనున్నారు. అలాగే కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. వీరిలో రోజాకి కూడా స్థానం లభించింది. కొత్తగా ఎంపికైన మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ