ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (తూర్పు రాయలసీమ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) బలపరిచిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కడప-అనంతపురం-కర్నూలు (పశ్చిమ రాయలసీమ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచినఎంవీ రామచంద్రారెడ్డి గెలుపొందారు. ముందుగా తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13, సోమవారం నాడు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 16, గురువారం ఉదయం 8 గంటలకు చేపట్టగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు.
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు. అలాగే పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎంవీ రామచంద్రారెడ్డి, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు ప్రకటించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. వీటిల్లో 9 స్థానిక సంస్థల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇంకా మిగిలిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వీటిలో రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు, ఒక చోట వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE