ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జాబ్ క్యాలెండర్పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై అధికారులతో చర్చించారు. ఏపీపీఎస్సీ, వైద్య-ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, బ్యాక్లాక్ పోస్టులు, ఉన్నత విద్య తదితర శాఖల్లో చేపట్టిన రిక్రూట్ మెంట్పై సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం భర్తీ చేయాల్సిన 47,465 పోస్టుల్లో సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉండగా, వీటిలో 1198 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నెలాఖరులోగా వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా నియమించాలని సూచించారు. అలాగే ఏపీపీఎస్సీలో పోస్టులను వచ్చే ఏడాది మార్చిలోగా భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ