దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల తనను కలిసిన అధికారులు, నాయకులను కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే భూమన కోరారు. గత కొన్ని రోజులుగా కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో అపోహలు తొలగించేలా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడుకి కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu