తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 6గురికి నోటీసులు ఇచ్చిన సిట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఎంపీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఆయన ప్రమేయంపై సిట్ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ నెల 29వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు దీనిపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇప్పటివరకూ తనకు సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. తనకు సిట్ నోటీసులిచ్చినట్లుగా మీడియాలో చూశానని, అయితే తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని ఆయన తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE