ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు (ఉదయం 11 గంటల వరకు):
- కర్నూలు – 25.96 శాతం
- విజయనగరం – 25.68 శాతం
- తూర్పుగోదావరి – 25 శాతం
- చిత్తూరు – 24.52 శాతం
- విశాఖపట్నం – 24.14 శాతం
- పశ్చిమగోదావరి – 23.40 శాతం
- అనంతపురం – 22.88 శాతం
- నెల్లూరు – 20.59 శాతం
- వైఎస్ఆర్ కడప – 19.72 శాతం
- శ్రీకాకుళం – 19.32 శాతం
- కృష్ణా – 19.29 శాతం
- గుంటూరు – 15.85 శాతం
- ప్రకాశం – 15.05 శాతం
–> ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 27,751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. వీటిల్లో 6314 అత్యంత సమస్యాత్మక, 6492 సమస్యాత్మక, 247 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
–> జెడ్పీటీసీ స్థానాల్లో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పోలింగ్లో మొత్తం 2,46,71,002 మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 9న నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ