ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు (మధ్యాహ్నం 1 గంట వరకు):
- విజయనగరం – 44.38 శాతం
- విశాఖపట్నం – 42.10 శాతం
- పశ్చిమగోదావరి – 41.90 శాతం
- చిత్తూరు – 41.87 శాతం
- తూర్పుగోదావరి – 41 శాతం
- కర్నూలు – 40.25 శాతం
- అనంతపురం – 37.79 శాతం
- శ్రీకాకుళం – 36.62 శాతం
- కృష్ణా – 36.02 శాతం
- నెల్లూరు – 34.20 శాతం
- వైఎస్ఆర్ కడప – 33.60 శాతం
- ప్రకాశం – 27.44 శాతం
- గుంటూరు – 27.26 శాతం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ