ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆయన భార్యకు, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా నిర్ధారణ అనంతరం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రత్యేక చికిత్స నిమిత్తం ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్లినట్టుగా సమాచారం. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 29168 కు చేరింది. వీరిలో 15412 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, 328 మంది మరణించారు. ప్రస్తుతం 11071 మంది ఆసుపత్రుల్లో, 2357 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu