సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని త్వరలో షూటింగ్ కి సిద్దమవుతుంది. నటీనటుల ఎంపిక, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, ఈ సినిమాలో చిరు సరసన నటిస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో మెగాస్టార్ పక్కన ప్రముఖ హీరోయిన్ నయనతార నటిస్తుందనే వార్తలు వచ్చాయి, ఇప్పటికే నయనతార చిరంజీవి పక్కన సైరా లాంటి భారీ ప్రాజెక్టులో నటించినందువల్ల, చిత్ర బృందం ఐశ్వర్య రాయ్ ని ఈ సినిమాలో తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి కిది 152 వ చిత్రం, కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవరించనున్నారు, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రభినయం చేయనున్నారు. ఈ సినిమాని 2020 వేసవిలో విడుదల చేయాలనీ చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ సైరా నరసింహారెడ్డి ‘ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జూలై ఆఖరునుంచి మొదలు పెట్టనున్నారు.