గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 13 మంది సభ్యులున్నారు. ఆగస్టు 14న ప్రసారమైన బిగ్ బాస్-3 ఇరవైఐదవ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో లెవెల్ -2 కొనసాగించారు. చాలా ప్రయత్నాల తర్వాత అలీరేజా ఇంటి కెప్టెన్ గా ఎంపికవుతాడు.
ఎపిసోడ్ 25( ఆగస్టు 14) హైలైట్స్: ఇంటి కెప్టెన్ గా అలీరేజా, శ్రీముఖి-రోహిణి గొడవ
- గజి బిజీ గోల అయినది సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
- రోహిణి- శ్రీముఖి మధ్యన ఎలిమినేషన్ విషయంలో గొడవ జరిగింది
- తనను ఎలిమినేట్ అవుతావు అని శ్రీముఖి అన్నందుకు రోహిణి వాదించింది
- తమన్నా విషయంలో తాను చెప్పిందే జరిగిందని, రోహిణి విషయంలో కూడ జరుగుతుందని శ్రీముఖి ఆనందంతో రోహిణి హార్ట్ అయి ఏడ్చేసింది
- ఇంటిలో మిగతా వాళ్లు రోహిణిని ఓదార్చారు
- అషు రెడ్డి, వితికా వెళ్లి శ్రీముఖిని అడిగేసారు, మేము మేము చూసుకుంటాం అంటూ శ్రీముఖి వారికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది
- చివరికి శ్రీముఖి, రోహిణికి సారీ చెప్పడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది
- నేనే రాజు-నేనే మంత్రి కెప్టెన్సీ టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఒక సింహాసనం ఏర్పాటు చేసి పోటీకి ఇద్దరు డ్రాగన్స్ ను ఎంపిక చేసారు. ఎండ్ బజర్ మోగే సమయానికి సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్లే ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెబుతాడు
- బజర్ మోగగానే రాహుల్, అలీరేజా లలో అలీరేజా వెళ్లి సింహాసనం పై కూర్చుంటాడు
- మిగతా ఇంటి సభ్యులు వారికీ నచ్చిన వారికీ మద్దతు ఇవ్వొచ్చని, లేకుంటే సింహాసనం పై ఉన్నవారిని దించేసి తమకు నచ్చిన వ్యక్తిని కూర్చొబెట్టొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు
- సింహాసనం పై ఉన్న అలీరేజా కి శ్రీముఖి, బాబాబాస్కర్ మద్దతుగా నిలిచారు
- రాహుల్ టీం ఎంత ప్రయత్నించినా అలీరేజా ను సింహాసనం పై నుండి దించలేకపోయారు
- రాహుల్, రవికృష్ణ ఎంత ప్రయత్నం చేసిన కూడ ఫలితం ఉండదు
- ఎండ్ బజర్ మోగే సమయానికి అలీరేజా సింహాసనం పై ఉండడంతో బిగ్ బాస్ అలీరేజాను కెప్టెన్ గా ప్రకటించాడు
- టాస్క్ తరువాత రవికృష్ణ బెడ్ రూమ్ లోకి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాడు
- ఇంటి సభ్యులు ఇంటిలో జరుగుతున్న సంఘటనలపై చర్చ చేసారు
- శ్రీముఖితో గొడవ గురించి రాహుల్ వరుణ్ సందేశ్ తో మాట్లాడాడు
- ఎపిసోడ్ చివర్లో రాహుల్ మరియు శ్రీముఖి వారి మధ్య జరిగిన గొడవలు గురించి మాట్లాడుకున్నారు