టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల ఆదర్శాల సాధనకు దేశ ప్రజలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర ప్రపంచంలోనే గర్వించదగింది అని చంద్రబాబు పేర్కొన్నారు. కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఎంతో కష్టపడిన, ఎందరో యోధుల త్యాగఫలమే భారతదేశమని ఆయన అభివర్ణించారు. ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అత్యుత్తమ దేశంగా ఉంచేలా అందరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.
[subscribe]
[youtube_video videoid=2x1t8IgXbO8]