మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్ర ట్రైలర్ ని మూవీ యూనిట్ గురువారం విడుదల చేసింది, విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో కాలంగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు విడుదలైన ట్రైలర్ అభిమానులను పూర్తిస్థాయిలో ఆక్కట్టుకునేలా ఉంది. ప్రేమ, బ్రేక్అప్, కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో జరిగే ఈ చిత్ర కధ అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తించేలా ఉంది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ మళ్ళీ దూకుడు పాత్రలో నటించినట్టుగా తెలుస్తోంది.
ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు, ఇప్పటికే కొన్ని పాటలు విడుదలై మంచి స్పందన పొందాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మంచి ప్రొడక్షన్ విలువలతో రూపొందిన ఈ చిత్రం జూలై 26 న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో విడుదల కానుంది. దర్శకుడు భరత్ కమ్మ కి ఇదే మొదటి చిత్రం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసే సందడి తెలుసుకోవాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.