పెరుగుతున్న కరోనా కేసులు, రెండువారాలు పాటు లాక్‌డౌన్

2 Weeks Lockdown in Kamrup District, Assam, Assam announces 2-week lockdown, Assam Curfew News, Assam Govt, Assam Govt Decides to Implement 2 Weeks Lockdown, Coronavirus, Kamrup District

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాలో జూన్ 28 అర్ధరాత్రి నుంచి రెండువారాల పాటుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో కేవలం మెడికల్ షాప్స్ మాత్రమే తెరచి ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటన చేశారు.

అలాగే రాష్ట్రంలో ఇకపై శని, ఆదివారాల్లో వీకెండ్‌ కర్ఫ్యూ‌ విధిస్తామన్నారు. పట్టణ, పురపాలక ప్రాంతాలన్ని వీకెండ్‌ కర్ఫ్యూ‌‌ పరిధిలోకి వస్తాయని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వీకెండ్‌ కర్ఫ్యూ‌‌ కొనసాగుతుందన్నారు. మరోవైపు అసోం లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 6647 కు చేరుకుంది. 4034 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, 2601 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ వలన రాష్ట్రంలో 9 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =