దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ముంబయి నగరంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవగా, తాజా కేసుల సంఖ్య ప్రకారం ఢిల్లీ ముంబయిని దాటేసింది. ముంబయి నగరంలో ఇప్పటివరకు 70,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 4062 మంది మరణించారు. ఇక ఢిల్లీలో ఇప్పటికి 73,780 కరోనా కేసులు, 2429 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశరాజధానిలో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుండడంతో జూన్ 30 లోగా కంటైన్మెంట్ జోన్లలోని అన్ని ఇళ్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు, దీంతో ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇటీవలే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu