ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 (15వ సీజన్) షెడ్యూల్ ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. మార్చి 26న తోలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభమవనుండగా, మే 29న ఫైనల్ జరగనుంది. మార్చి 26న 2021 ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.
ఈ సీజన్ లో 65 రోజుల వ్యవధిలో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు మరియు 4 ప్లేఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. అలాగే ఈసారి ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు పూర్తిగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే జరగనున్నాయి. ముంబయి లోని వాంఖడే స్టేడియంలో 20, నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో 20, బ్రబౌర్న్ స్టేడియంలో 15, మరియు పూణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్లో 15 మ్యాచులు నిర్వహించనున్నారు. మే 22తో లీగ్ మ్యాచ్లు ముగియనుండగా, మే 29న జరగాబోయే ఫైనల్, మరియు ప్లేఆఫ్ ల షెడ్యూల్ తర్వాత ప్రకటించబడుతుందని బీసీసీఐ ప్రకటించింది.
Hello Fans 👋
Set your reminders and mark your calendars. 🗓️
Which team are you rooting for in #TATAIPL 2022❓🤔 pic.twitter.com/cBCzL1tocA
— IndianPremierLeague (@IPL) March 6, 2022
🚨 NEWS 🚨: The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for #TATAIPL 2022 which will be held in Mumbai and Pune.
A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days.
More Details 🔽
— IndianPremierLeague (@IPL) March 6, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ