ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి సమావేశాలు జరగబోతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ఈరోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ పరిస్థితుల వలన 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో.. వర్చువల్ విధానంలోనే గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం అనంతరం, బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం జరుగనుంది. మార్చి 11న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ