తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి (మార్చి 7, సోమవారం) నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సమావేశాల తొలిరోజునే 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ