పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సెప్టెంబర్ 30న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు చోట్ల నేడు (అక్టోబరు 3, ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా భవానీపూర్ స్థానం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండడంతో ఈ ఉపఎన్నికకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. భవానీపూర్ ఉపఎన్నికలో బీజేపీ తరపున ప్రియాంక టైబ్రెవాల్, సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ బరిలో నిలిచారు.
తాజాగా ఓట్ల లెక్కింపులో మమతా బెనర్జీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 19వ రౌండ్ కౌంటింగ్ తరువాత సమీప బీజేపీ అభ్యర్థి ప్రియాంక టైబ్రెవాల్ పై మమతా బెనర్జీ 52,017 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మమతా బెనర్జీ ఆధిక్యంతో టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు కోల్కతాలో పెద్దఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు శంషేర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీఎంసీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఇక పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ