శ్రీలంకతో జనవరి 10నుంచి జరుగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రాను శ్రీలంకతో జరుగబోయే సిరీస్కు తొలుత ఎంపిక చేయలేదు. అయితే ఇటీవలే అతడిని భారత వన్డే జట్టులోకి తీసుకున్నారు. కానీ ఫిట్నెస్ టెస్టులో బుమ్రా విఫలం కావడంతో అతడికి మరికొంతకాలం విశ్రాంతిని ప్రకటించారు. జట్టుతో చేరేందుకు సిద్ధమైన బుమ్రా బౌలింగ్లో పుంజుకోవడానికి మరికొంత సమయం కావాలని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సెలక్షన్ కమిటీ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా మంగళవారం నుంచి గౌహతి వేదికగా మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE