దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి రాజ్యసభ బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇంకా పలువురు హాజరయ్యారు.
కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియోజక వర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యసమస్యలు వంటి పలు అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి మోదీ వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆయా రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తేవడానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించటం వంటి అంశాలపై మోదీ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేయడం కోసం వారు ప్రధాని మోదీతో చర్చించి.. మోదీ సలహాలు, సూచనల మేరకు ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ