ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు 2022 కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్-2022 కోసం భారత మహిళల బాక్సింగ్ స్క్వాడ్ ను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) శనివారం నాడు ప్రకటించింది. న్యూఢిల్లీలో మూడు రోజుల సెలెక్షన్ ట్రయల్స్ ముగిసిన అనంతరం నలుగురు మహిళా బాక్సర్లు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.
ఇందులో ఇటీవల ప్రపంచ మహిళా ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లినా బోర్గోహైన్, అలాగే నీతూ మరియు జాస్మిన్ చోటు దక్కించుకున్నారు. కాగా నిఖత్ జరీన్ 50 కేజీలు విభాగంలో, లవ్లినా బోర్గోహైన్ (70 కిలోలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60కిలోలు) విభాగాల్లో చోటు దక్కించుకున్నారు. ఇక సీనియర్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ట్రయల్స్ సమయంలో గాయం కారణంగా కామన్ వెల్త్ గేమ్స్ నుండి తప్పుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY