ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2020 సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. యూఏఈలో అబుదాబి, షార్జా మరియు దుబాయ్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజాగా వెల్లడించారు. ఈ లీగ్ 51 రోజుల పాటు జరగనుండగా, ఫైనల్ను నవంబర్ 8న నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లు ఆగస్టు 20 కల్లా యూఏఈకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాయి. అయితే ఐపీఎల్-2020 కి సంబంధించి షెడ్యూల్, ఇతర విధివిధానాలు ఇంకా నిర్ణయించాల్సి ఉంది. వచ్చే వారం జరిగే ఐపీఎల్ పాలకమండలిలో చర్చించి, షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. అలాగే ఐపీఎల్ ముగిసాక భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu