కేంద్రప్రభుత్వం శనివారం నాడు 22 రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సిఫారసు మేరకు 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) యొక్క సెంట్రల్ షేర్ 1వ విడతను సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సాధారణంగా ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం జూన్ నెలలో ఎస్డీఆర్ఎఫ్ యొక్క మొదటి విడత నిధులు విడుదల అవుతాయి. అయితే ఈసారి గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి వినియోగ ధృవీకరణ పత్రం కోసం చూడకుండా ఈ నిధులను విడుదల చేశారు.
కాగా కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం వరకు (రూ.4436.8 కోట్లు) కోవిడ్-19 నియంత్రణ చర్యల కోసం రాష్ట్రాలు ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ఆస్పత్రుల కోసం, వెంటిలేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడం, కోవిడ్-19 ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ ఉత్పత్తి మరియు నిల్వ ప్లాంట్ల కోసం ఎస్డీఆర్ఎఫ్ నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ