రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీకాలం ఫలవంతంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారతదేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయడాన్ని యావత్ దేశం గర్వంగా చూసిందని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
“భారతదేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జీ ప్రమాణ స్వీకారం చేయడాన్ని యావత్ దేశం గర్వంగా చూసింది. ఆమె రాష్ట్రపతి పదవీని చేపట్టడం భారతదేశానికి ప్రత్యేకించి పేదలు, అట్టడుగువర్గాలు మరియు అణగారిన వర్గాల కోసం ఒక చారిత్రక మార్పును గుర్తించే ఘట్టం. ఫలవంతమైన రాష్ట్రపతి పదవీకాలం కోసం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ తన ప్రసంగంలో ఆశ మరియు కరుణ సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న తరుణంలో ఆమె భారతదేశం సాధించిన విజయాలపై ఉద్ఘాటించింది మరియు ముందుకు సాగే మార్గానికి సంబంధించిన భవిష్యత్తు దృష్టిని అందించారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY