తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ అయింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు తక్షణమే వైద్య ఆరోగ్య శాఖను ఈటల రాజేందర్ నుంచి సీఎం కేసీఆర్ కు బదిలీచేస్తూ ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. మరోవైపు భూకబ్జా ఆరోపణలపై అచ్చంపేటలో విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదికను అధికారులు సీఎం కేసీఆర్ కు సమర్పించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ