దేశంలో అక్టోబర్ 5, సోమవారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 66,23,815 కు, మరణాల సంఖ్య 1,02,685 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో కరోనా వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. దేశంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 4 నాటికీ దేశవ్యాప్తంగా 7,99,82,394 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజువారి పరీక్ష సామర్ధ్యం కూడా 11 లక్షలకు చేరుకుంది. ఇప్పటికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన టాప్ 10 రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 14,43,409
- ఆంధ్రప్రదేశ్ – 7,23,512
- కర్ణాటక – 6,40,661
- తమిళనాడు – 6,25,391
- ఉత్తరప్రదేశ్ – 4,17,437
- ఢిల్లీ – 2,92,560
- పశ్చిమ బెంగాల్ – 2,73,679
- ఒడిశా – 2,35,330
- కేరళ – 2,34,929
-
తెలంగాణ – 2,00,611
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu