తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో టీఎస్ ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 1,19,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఎంసెట్-2020 ఫలితాలు అక్టోబర్ 6, మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ముందుగా అక్టోబర్ 5 నే ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని భావించగా, అదే రోజు జేఈఈ అడ్వాన్స్డ్-2020 ఫలితాలు విడుదల ఉండడంతో, ఈ ఫలితాలను అక్టోబర్ 6న విడుదలచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు టీఎస్ ఎంసెట్-2020 కౌన్సెలింగ్ అక్టోబర్ 9 న ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu