భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 6 లక్షలకు చేరువయ్యాయి. జూలై 1, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,85,493 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు, 507 కరోనా మరణాలు నమోదయ్యాయి.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 17,400 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 3,47,979 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,20,114 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు జూన్ నెలలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించింది. కేవలం జూన్ నెలలోనే దాదాపుగా 4 లక్షల పాజిటివ్ కేసులు, 12 వేల మరణాలు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 4వ స్థానంలో, కరోనా మరణాల్లో 8వ స్థానంలో నిలిచింది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 01st July, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 585,493
▶️ Active cases: 220,114
▶️ Cured/Discharged/Migrated: 347,979
▶️ Deaths: 17,400#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/0tKP7uLt5j
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) July 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu