మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 13, సోమవారం నాడు 1,885 కరోనా కేసులు, 1 మరణం నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,12,462కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,871 గా ఉంది. ఇక కొత్తగా కరోనా నుంచి 774 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,47,111 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.91 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 17,480 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా ముంబయిలో అత్యధికంగా 11331 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 3233, పుణేలో 1208, రాయగడ్ లో 628, పాల్గర్ లో 479 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 8,13,46,204 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY