కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి మొదలుకొని దేశంలో జరుపుతున్న కరోనా పరీక్షలు మరో కీలక మైలురాయి దాటాయి. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య ఈ రోజుతో 4 కోట్లు దాటింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆగస్టు 29 నాటికీ మొత్తం 4,04,06,609 మంది శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9,28,761 కరోనా పరీక్షలను నిర్వహించారు. ప్రతి మిలియన్ జనాభాకు 29,280 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 1002 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 574 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1576 అయింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu