దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 13, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 11813 కరోనా పాజిటివ్ కేసులు, 413 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,60,126 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 19,063 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 9115 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 3,90,958 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,49,798 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 13 నాటికీ 29,81,077 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu