ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై జారీచేసిన గెజిట్ లపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించి ఆగస్టు 14 వరకు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై దాఖలైన దాదాపు 55 పిటిషన్లపై శుక్రవారం నాడు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజధాని తరలింపు విషయంలో ఆగస్టు 27 వరకు యథాతథ స్థితిని (స్టేటస్ కో) అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 27కు కోర్టు వాయిదా వేసింది. ముందుగా విచారణలో భాగంగా రాజధాని అంశంలో ప్రభుత్వం జారీ చేసిన గెజిట్స్ అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu