దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గత 24 గంటల్లో 2 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 52వ రోజైన మార్చి 8, సోమవారం నాడు ఒక్కరోజే 20 లక్షలకుపైగా (20,19,723) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2.3 కోట్లు (2,30,08,733) దాటినట్టు పేర్కొన్నారు.
దేశంలో మార్చి 8న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (20,19,723):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 89,099
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,91,930
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,82,782
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,12,413
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 12,22,351
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 2,21,148
- మార్చి 8న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 20,19,723
దేశంలో మార్చి 9 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 2,30,08,733):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 70,75,010
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 37,39,478
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 67,92,319
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 3,25,972
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 43,74,145
- కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 7,01,809
- మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 2,30,08,733
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ