దేశంలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,388 కరోనా కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,44,786 కు, మరణాల సంఖ్య 1,57,930 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్ మరియు ఆసుపత్రుల్లో 1,87,462 (1.67%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు 16,596 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,08,99,394 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.93 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.40 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 84 శాతం 6 రాష్ట్రాలలోనే:
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 84.04 శాతం మహారాష్ట్ర(8744), కేరళ (1412), పంజాబ్ (1229), తమిళనాడు (556), గుజరాత్ (555), కర్ణాటక (436) వంటి 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక మార్చి 8, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా 22,27,16,796 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,48,525 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ