తెలంగాణాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి పైగా కరోనా సోకింది. కరోనాబారిన పడినవారిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా, ఏడుగురు ఫ్యాకల్టీలు, ఆరుగురు ఇతర ఉద్యోగులున్నారు. ఈ నెల తొలి వారం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీకి వచ్చారు. ఐదో తేదీన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప లక్షణాలుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో రెండుడోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉన్నవారినే క్యాంపస్లోకి అనుమతించారు. ప్రస్తుతం క్యాంపస్లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు, వారి కుటుంబీకులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ