దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. రాబోయే 3 రోజుల్లో మరో 47 లక్షలకుపైగా (20,48,890) వ్యాక్సిన్ డోసులను అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత కేటగిరీ ద్వారా మరియు నేరుగా రాష్ట్రాల సేకరణ కేటగిరీ ద్వారా మొత్తం 26.69 కోట్లకుపైగా (26,69,14,930) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూన్ 15, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25,67,21,069 డోసులను వినియోగించినట్టు కేంద్రం ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 1.05 కోట్లకుపైగా (1,05,61,861) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ