ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 3, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,13,014 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 5941 కి పెరిగింది. మరో 7798 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5941 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 3, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 60,21,395
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,13,014
- కొత్తగా నమోదైనా కేసులు : 6224
- నమోదైన మరణాలు : 41
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 6,51,791
- యాక్టీవ్ కేసులు : 55282
- మొత్తం మరణాల సంఖ్య : 5941
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu