సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తో తలపడే న్యూజిలాండ్ ఆటగాళ్ల జాబితాను కివీస్ బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టుకు గాయాల కారణంగా దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరియు వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ ఈ 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పై క్రీడాభిమానులపై భారీ ఆసక్తి నెలకుంది.
న్యూజిలాండ్ టెస్టు జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ