కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ లద్దాఖ్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా జూలై 17, శుక్రవారం ఉదయం ఆయన లద్దాఖ్ చేరుకున్నారు. రాజ్నాథ్సింగ్ తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే కూడా ఉన్నారు. గత నెల రోజులుగా భారత్-చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు. తరవాత సైనిక ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజు పర్యటనలో భాగంగా శనివారం నాడు మంత్రి శ్రీనగర్లో కూడా పర్యటిస్తారు. శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఢిల్లీ చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu