వచ్చే నెలలో (జూన్ 7-11 తేదీల్లో) లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు శుభవార్త. పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో భారతదేశం నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో భారత్ దాదాపు 15 నెలల పాటు పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టును అధిగమించింది.
కాగా అంతకుముందు 2021 డిసెంబర్లో భారత్ చివరిగా ఒక నెల పాటు అగ్రస్థానంలో ఉంది. ఇక మొత్తం 25 మ్యాచ్ల్లో భారత్ 3031 పాయింట్లు, 121 రేటింగ్ తో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 23 మ్యాచ్ల్లో 2679 పాయింట్లు, 116 రేటింగ్ సాధించింది. అలాగే మూడో స్థానంలో ఇంగ్లండ్, నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా, పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE