ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏమాత్రం లేదని, కావాలనే ఆయనను ఈ కేసులో ఇరికించారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సీఎం కేజ్రీవాల్ సీబీఐపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. లిక్కర్ పాలసీ విచారణలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని నాకు తెలిసింది. వారందరికీ అతనిపై అపారమైన గౌరవం ఉంది మరియు అతనిపై ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఆయనను అరెస్టు చేయాలనే రాజకీయ గురువుల ఒత్తిళ్ల కారణంగానే ఆధారాలు లేకుండా బలవంతంగా అలా చేయవలసి వచ్చింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
I am told that most CBI officers were against Manish’s arrest. All of them have huge respect for him and there is no evidence against him. But the political pressure to arrest him was so high that they had to obey their political masters
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2023
కాగా ఢిల్లీ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మరియు అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఈ కేసులో ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆదివారం మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన చర్యలలో ఇది సంచలనం కలిగించే పరిణామంగా మారింది. ఇక అంతకుముందు ఆప్ మద్దతుదారులతో రోడ్షో నిర్వహించి, ఆప్ పురోగతికి బిజెపి భయపడుతున్నందున తనను నకిలీ కేసులో ఇరికించారని అన్నారు. ఇక దీనిపై విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ మరియు ఈడీలు పలువురు ప్రముఖుల పేర్లను పేర్కొంటూ చార్జిషీట్స్ కూడా దాఖలు చేశాయి. ఇక కేసులో ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను, ప్రముఖులను అరెస్ట్ చేసిన కేంద్ర ఏజెన్సీలు మనీష్ సిసోడియా అరెస్టుతో తాజాగా మరో అడుగు ముందుకేసాయి. కాగా సిసోడియాను ఐదు రోజుల రిమాండ్ కోరిన సీబీఐ వినతిపై కోర్టు ఆర్డర్ రిజర్వ్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE