బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నటి ఖుష్బూతో పాటుగా మరో ఇద్దరినీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియమించింది. “జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 (20 ఆఫ్ 1990) సెక్షన్ 3 కింద ఖుష్బూ, మమతా కుమారి, డెలీనా ఖోంగ్డుప్లను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరూ పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి మూడేళ్ళ పాటుగా లేదా 65 ఏళ్ల వరకు ఏది ముందుగా వర్తిస్తే అప్పటివరకు పదవీలో కొనసాగుతారు” అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ జారీ చేసింది.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం కావడంపై నటి ఖుష్బూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రధాని నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి మరియు పోషించడానికి నేను తీవ్రంగా కృషి చేస్తాను. ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూకు బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై, పలువురు బీజేపీ నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE