కోవిడ్-19 నేపథ్యంలో ప్రయాణ మరియు వీసా పరిమితుల్లో భాగంగా అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుండగా, తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఆ నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2021న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ విమాన సర్వీసులపై నిషేదాన్ని పొగిస్తునట్టుగా డీజీసీఏ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అలాగే ఎయిర్ బబుల్ ఏర్పాట్లతో నడిచే విమానాలు కూడా ప్రభావితం కావని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ