గుంటూరు పర్యటనలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Vice-President Venkaiah Naidu in Two-Day Visit of Andhra Pradesh, Vice-President Venkaiah Naidu, Venkaiah Naidu in Two-Day Visit of Andhra Pradesh, Venkaiah Naidu in Two-Day Visit of AP, Venkaiah Naidu, Vice-President, Two-Day Visit of Andhra Pradesh, Two-Day Visit of AP, Andhra Pradesh, Vice-President Of India, Vice-President Of India Venkaiah Naidu, Vice President Venkaiah Naidu AP Tour, Venkaiah Naidu AP Tour, AP Tour, Venkaiah Naidu AP Tour Latest News, Venkaiah Naidu AP Tour Latest Updates, Venkaiah Naidu AP Tour Live Updates, Mango News, Mango News Telugu,

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “పాఠశాల స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతలు అందించిన సహాయ సహకారాలతో పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిసిందని.. దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని” సూచించారు.

ఇంకా వెంకయ్య ఇలా అన్నారు.. ప్రస్తుత దేశ రాజకీయాలలో నైతికత కలిగిన నాయకులు కొరవడ్డారని.. ఇది బాధాకరమని అన్నారు. తమ స్వలాభాల కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి సమాజంలో అశాంతిని కలిగిస్తున్నారని తెలిపారు. అమాయక ప్రజలు ఆవేశాలకు లోను కావడం సహజమని.. అయితే, నాయకులుగా చలామణి అవుతున్నవారు ప్రజల మధ్య చీలికలు సృష్టించడం అత్యంత హేయమన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఒక దిక్సూచిగా ఉండాలని.. మనమే ఇలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తే ముందు ముందు వారు ఇంకెలా నడుచుకుంటారోనని భయం కలుగుతుందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =