అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగాల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జనవరి, 2022 నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సంచలనం కీగన్ పీటర్సన్ గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికా అండర్-19 స్టార్ డెవాల్డ్ బ్రెవిస్ మరియు బంగ్లాదేశ్ పేసర్ ఎబాడోట్ హొస్సేన్లతో పాటు నామినేట్ అయిన పీటర్సన్, భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చేసిన అద్భుత ప్రదర్శనకు గానూ ఈ అవార్డును అందుకున్నాడు. భారత్ తో టెస్ట్ సిరీస్ లో మొత్తం 276 పరుగులతో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఎంపికయ్యాడు.
మరోవైపు జనవరి నెలకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గెలుచుకున్నారు. ఓటింగ్ లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు మరియు వెస్టిండీస్ స్టార్ డియాండ్రా డాటిన్ కంటే ముందంజలో నిలిచి ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాతో కాన్బెర్రాలో జరిగిన ఏకైక యాషెస్ టెస్టులో హీథర్ నైట్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది. ఈ టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో హీథర్ నైట్ 168, 48 పరుగులు చేసింది. తోలి ఇన్నింగ్స్ లో 168 నాటౌట్ గా ఉన్న హీథర్ నైట్ మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ గా గుర్తింపు పొందింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ