గతేడాది దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ ట్రస్ట్ల నుండి ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 258.43 కోట్ల విరాళాలు అందుకున్నాయి. అయితే అందులో మెజారిటీ వాటా బీజేపీ దక్కించుకుంది. రూ.212 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విరాళాలను స్వీకరించినట్లు ప్రకటించిన ఏడు ఎలక్టోరల్ ట్రస్టులు కార్పొరేట్లు మరియు వ్యక్తుల నుండి మొత్తం రూ. 258.49 కోట్లు పొందాయి మరియు వివిధ రాజకీయ పార్టీలకు రూ. 258.43 కోట్లు (99.97 శాతం) పంపిణీ చేశాయి. టాప్ 10 మంది దాతలు ఎలక్టోరల్ ట్రస్ట్లకు రూ. 223.00 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టులు అందుకున్న మొత్తం విరాళాల్లో 86.27 శాతం కాగా, అన్ని రాజకీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో 82.05 శాతంతో ఒక్క బీజేపీయే రూ. 212.05 కోట్లు అందుకుంది.
దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, జెడియు, ఐఎన్సి, ఎన్సిపి, ఎఐఎడిఎంకె, డిఎంకె, ఆర్జెడి, ఆప్, ఎల్జెపి, సిపిఎం, సిపిఐ మరియు లోక్తాంత్రిక్ జనతాదళ్ విరాళాలు అందుకున్న ప్రధాన పార్టీలలో ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఎలక్టోరల్ ట్రస్ట్ల దాతలందరిలో ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ అత్యధికంగా రూ. 100 కోట్లను అందించగా, హల్దియా ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ. 25 కోట్లు మరియు మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ. 22 కోట్లను వివిధ ట్రస్ట్లకు అందించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 159 మంది వ్యక్తులు ఎలక్టోరల్ ట్రస్ట్లకు విరాళాలు అందించారు: ఇద్దరు వ్యక్తులు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కు రూ. 3.50 కోట్లు, 153 మంది వ్యక్తులు చిన్న విరాళాల ఎలక్టోరల్ ట్రస్ట్కు రూ. 3.202 కోట్లు, ముగ్గురు వ్యక్తులు మొత్తం రూ. 5 లక్షలకు అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ