దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో 23,529 కేసులు, 311 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,48,062 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అస్సాం, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 28,718 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,30,14,898 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.85 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 2,77,020 (0.82%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (సెప్టెంబర్ 29 (8am)–సెప్టెంబర్ 30 (8am)):
- కేరళ – 12161
- మహారాష్ట్ర – 3187
- తమిళనాడు – 1624
- మిజోరాం – 1,380
- ఆంధ్రప్రదేశ్ – 1,084
- వెస్ట్ బెంగాల్ – 748
- ఒడిశా – 565
- కర్ణాటక – 539
- అస్సాం – 366
- తెలంగాణ – 245
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ