తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్) ఫలితాలు సెప్టెంబర్ 6న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను బుధవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అక్టోబరు 1వ తేదీన పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్ లో జరుగుతుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎంటెక్ లో ప్రవేశాలకై 83 కాలేజీల్లో 6,437 కన్వీనర్ కోటా సీట్లు, ఎంఫార్మసీలో 101 కాలేజీల్లో 3,593 సీట్లు, ఫార్మ్.డీలో 25 కాలేజీల్లో 250 సీట్లు, ఎం.ఆర్క్లో 7 కాలేజీల్లో 200 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ