కరోనా మహమ్మారి సృష్టించిన విలయం మరువక ముందే ప్రజలపై మరో మహమ్మారి దాడి చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే ఇండియాలో వెలుగుచూసిన ‘ఇన్ఫ్లూయెంజా హెచ్3ఎన్2’ కలకలం రేపుతోంది. తాజాగా ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దీని ప్రకారం.. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు. దీంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు, దేశంలో దాదాపు 90 వరకు హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి. అలాగే హెచ్1ఎన్1 వైరస్ కేసులు కూడా మరో ఎనిమిది నివేదించబడ్డాయి. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కాగా ‘హాంకాంగ్ ఫ్లూ’ అని కూడా పిలువబడే ఈ హెచ్3ఎన్2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయి. అయితే, భారతదేశంలో ఇప్పటివరకు హెచ్3ఎన్2 మరియు హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్లు మాత్రమే కనుగొనబడ్డాయి. విపరీతమైన జ్వరం, చలి, దగ్గు, శ్వాస ఆడకపోవడం మరియు గురక వంటివి ఈ ఇన్ఫెక్షన్ల ముఖ్య లక్షణాలు అని వైద్యులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE